ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ ముందుగా గవర్నర్కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో పెద్దఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సహా పలు ఇతర అంశాలపై ఈ సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశమునట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ