ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. రాజధాని అమరావతి భూముల అక్రమాలపై 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. అలాగే నోటీసులో తెలిపిన విధంగా ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా చంద్రబాబును కోరినట్టు తెలిపారు. అమరావతి భూముల అక్రమాలపై విచారణ చేస్తున్న సీఐడీ తాజాగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ