తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రెండు చోట్ల జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వర్షాలు-వరదల వలన హైదరాబాద్ తో పాటుగా జిల్లాల్లో ఏర్పడ్డ నష్టం, సన్నరకం ధాన్యం మద్దతు ధర, కరోనా పరిస్థితులు సహా పలు ఇతర అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం నాడు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ