తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 862 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 862 కేసులతో కలిపి నవంబర్ 25, బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,904 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 1444 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,54,676 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ కాగా, గత 24 గంటల్లోనే 961 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 10,784 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 53 లక్షలకు చేరువైంది. బుధవారం నాడు 41,101 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 52,89,908 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,42,125 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ