నగరంలోని పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్‌ ఘాట్‌ లు సందర్శించిన బండి సంజయ్

BJP MP Bandi Sanjay Visits Senior NTR Ghat, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections 2020 Nominations, GHMC Elections News, GHMC Elections Updates, Mango News, MP Bandi Sanjay, MP Bandi Sanjay Visits PV Narasimha Rao and NTR Ghats, MP Bandi Sanjay Visits PV Narasimha Rao Ghat, NTR Ghat, Telangana BJP chief, Telangana BJP chief Bandi Sanjay Kumar

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తూ, నగరంలోని పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్‌ ఘాట్‌లను గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లకు బీజేపీ రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతుందని అన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ, ఏపీ బీజేపీ శాఖలు తరపున కోరుతామని బండి సంజయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =