వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.19,189 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ. 25,540 కోట్లు, ఐజీఎస్టీ రూ.51,992 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.22,078 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి 8,242 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.809 కోట్లు) వసూలు అయ్యాయి. లాక్ డౌన్ అనంతరం అక్టోబర్ (రూ.1,05,155 కోట్లు) తర్వాత నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం విశేషం. అత్యధికంగా మహారాష్ట్ర రాష్ట్రం నుంచి రూ.15,001 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ