దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 5, శనివారం నాడు 3419 కరోనా కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,89,544 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 9574 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 4916 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,53,292 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 93.8 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 26,678 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నాటికీ ఢిల్లీలో 66,67,176 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ