ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఏపీ మరో మైలు రాయిని అధిగమించింది. జూన్ 9, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో 2,00,39,764 కరోనా పరీక్షలు నిర్వహించారు. జాతీయస్థాయిలో కంటే ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించామని, రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
అలాగే మే 16 నాటికి కరోనా పాజిటివిటీ రేట్ 25.56 శాతంగా ఉండగా, ప్రస్తుతం 9.37 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఇక బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12వ విడత జ్వర పీడుతుల గుర్తింపు సర్వే కార్యక్రమం ప్రారంభమైందని, ఈ సర్వేకు సంబంధించిన జర్వ పీడితుల వివరాలను జూన్ 11 వ తేదీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రానున్నాయని అనిల్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ