కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో ఇంకా పాఠశాలలు ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10, 12 తరగతుల విద్యార్థులు డిసెంబర్ 14 నుండి ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు గంటల పాటుగా పాఠశాలలకు బౌతికంగా హాజరుకావాలని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 9 మరియు 11 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 21 నుండి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే విద్యార్థులు తమ పాఠశాలలకు హాజరు కావడానికి 72 గంటలకు ముందుగా కరోనా పరీక్ష చేయించుకుని, కరోనా నెగటివ్ నివేదికను సమర్పించాల్సి ఉంటుందని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. అన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్రంలోని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ