పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు కీలక ప్రకటన చేశారు. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో మిస్సైల్ యూనిట్లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్ దూసుకెళ్లింది. అది 124 కిలోమీటర్ల లోపల ల్యాండ్ అయింది. అయితే, అది పాకిస్థాన్ భూభాగంలో పడిందని తర్వాతే తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకరం అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదవశాత్తు మిస్సైల్ ఫైర్ అయ్యిందని, అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. అయితే, ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి రాజ్నాథ్ తెలిపారు. తమ ప్రభుత్వం వెపన్ సిస్టమ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
రాజ్యసభలో సభ్యులను ఉద్దేశించి రాజ్నాథ్.. భారతీయ మిస్సైల్ వ్యవస్థ అత్యంత సురక్షితమైందని, నమ్మదగినదని మంత్రి సభకు హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని నేను సభకు తెలియజేయాలనుకుంటున్నాను. అధికారికంగా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. ఈ విచారణలో ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తామన్నారు. మా కార్యకలాపాలు, నిర్వహణ మరియు తనిఖీలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల సమితిని అనుసరించి నిర్వహించబడతాయి. మా ఆయుధ వ్యవస్థల భద్రత మరియు భద్రతలో ఏవైనా అలసత్వం కనుగొనబడితే వెంటనే పరిష్కరించబడుతుంది. అటువంటి వ్యవస్థలను నిర్వహించడంలో మన సాయుధ బలగాలకు ఆ అనుభవం ఉంది అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ