ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,995 కు, మరణాల సంఖ్య 7047 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా 538 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 558 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,61,711 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5237 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ