దేశంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 23,285 కరోనా కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,08,846 కు, మరణాల సంఖ్య 1,58,306 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్ మరియు ఆసుపత్రుల్లో 1,97,237 (1.74%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు 15,157 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,09,53,303 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.86 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.40 శాతంగా ఉంది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86 శాతం 6 రాష్ట్రాలలోనే:
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 85.6 శాతం మహారాష్ట్ర(14317), కేరళ (2133), పంజాబ్ (1305), కర్ణాటక (783), గుజరాత్ (710), తమిళనాడు (685) వంటి 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక మార్చి 11, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా 22,49,98,638 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,40,345 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ