దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 513 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,64,623 కి పెరిగింది. దేశంలో మళ్ళీ యాక్టీవ్ కేసుల సంఖ్య 7 లక్షలకు (6,91,597) చేరువైంది. కొత్తగా మహారాష్ట్ర (49447), ఛత్తీస్ ఘడ్ (5818), కర్ణాటక (4373), ఢిల్లీ (3567), తమిళనాడు (3446), ఉత్తర్ ప్రదేశ్ (3817), మధ్యప్రదేశ్ (2839), గుజరాత్ (2815) వంటి 8 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 93,249 కేసులలో 80.96% శాతం ఈ 8 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 93.14 శాతం, మరణాల రేటు 1.32 శాతం:
దేశంలో మరో 60,048 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,16,29,289 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.14 శాతం గానూ, మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో ఒడిశా, అస్సాం, పుదుచ్చేరి, లద్దాఖ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ