దేశంలో 65 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకే రోజు 65,081 మంది డిశ్చార్జ్

India Corona Updates, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, India Corona Updates, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 69921 పాజిటివ్ కేసులు నమోదవగా, 819 మంది మరణించారు. సెప్టెంబర్ 1, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 36,91,167 కు, మరణాల సంఖ్య 65,288 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మరణాల రేటు 1.77 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

మరోవైపు ఒకే రోజులో 65,081 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 28,39,882 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 76.94 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 7,85,996 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − four =