ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అనుమతి ఇచ్చిన విధంగా, అర్హత ఉన్న వారందరూ వెంటనే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరోవైపు మార్చి 1 వ తేదీన చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్న సంగతి తెలిసిందే.
Took the second dose of COVID-19 vaccine at AIIMS today. I appeal to all the eligible people to get themselves vaccinated immediately & everyone to continue to follow all precautions in view of the surge in cases in some parts of the country. pic.twitter.com/2qi3KER79l
— Vice President of India (@VPSecretariat) April 4, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ