దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది. మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్ లో 49, తెలంగాణలో 44, రాజస్థాన్ లో 43, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 578 బాధితుల్లో ఇప్పటికే 151 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
మరోవైపు దేశంలో గత 60 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 15 వేలలోపే నమోదవుతున్నాయి. కొత్తగా 6,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,93,333 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 315 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,79,997 కి పెరిగింది. ప్రస్తుతం 75,841 (0.22%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో కేరళ (1824), మహారాష్ట్ర (1648), తమిళనాడు (610), వెస్ట్ బెంగాల్ (544), కర్ణాటక (348), ఢిల్లీ (290), గుజరాత్ (177), జమ్మూ అండ్ కశ్మీర్ (124), ఒడిశా (112), తెలంగాణ (109) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 7,141 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,42,37,495 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.40 శాతంగానూ, మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ