కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు రెండోసారి కరోనా పాజిటివ్

#Karnataka, CM Yediyurappa, Karnataka CM BS Yediyurappa tests COVID-19 positive, Karnataka CM BS Yediyurappa tests positive for coronavirus, Karnataka CM Yediyurappa, Karnataka CM Yediyurappa Tested Covid-19 Positive for the Second Time, Karnataka CM Yediyurappa tests positive for Covid-19 twice, Mango News, Yediyurappa, Yediyurappa Tested Covid-19 Positive for the Second Time, Yediyurappa tests COVID-19 positive

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. “స్వల్ప జ్వరం రావడంతో ఈ రోజు కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను, ఫలితం పాజిటివ్ గా వచ్చింది. నేను బాగానే ఉన్నప్పటికీ, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. ఇటీవల నాతో సంప్రదించిన వారు గమనించుకొని, స్వీయ నిర్బంధాన్ని పాటించాలని అభ్యర్థిస్తున్నానని” సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.

ముందుగా జ్వరంతో సీఎం యడియూరప్ప రామయ్య మెమోరియల్ ఆసుపత్రి చేరారు. కాగా కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రిలో చేరినట్టు కర్ణాటక అధికార వర్గాలు వెల్లడించాయి. 2020 ఆగస్టు నెలలో సీఎం యడియూరప్పకు తొలిసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తొమ్మిది రోజుల చికిత్స అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఇటీవలే ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు కూడా తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 9 =