భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు (పీవీ సింధు) అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు స్వర్ణ పతకం సాధించిన సందర్భంగా బ్యాడ్మింటన్ అకాడమీ కోసం స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పీవీ సింధుకు విశాఖ రూరల్ చినగడిలి గ్రామంలో రెండు ఎకరాలు భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. చినగడిలిలోని ఆ రెండెకరాల భూమిని పశుసంవర్ధక శాఖ నుండి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ భూమిని ఉచితంగా కేటాయిస్తున్నామని తెలిపారు. కేవలం అకాడమీ అవసరాల కోసమే ఉపయోగించుకోవాలని, వాణిజ్య అవసరాలకోసం ఈ భూమిని వాడకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ