ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జూన్ 9, మంగళవారం నాడు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కలిశారు. మధ్యాహ్నం మూడుగంటలకు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయింది. ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ కు అనుమతి, థియేటర్స్ తెరవడం, టాలీవుడ్ సమస్యలు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే షూటింగ్స్ కు సంబంధించి ఏపీలో సింగిల్ విండో అనుమతి ఇవ్వడంపై సీఎం వైఎస్ జగన్కు వారు ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తుంది. సీఎంను కలిసిన వారిలో చిరంజీవితో పాటుగా అగ్రనటుడు నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాతలు సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu