సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం నాడు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 12వ తరగతికి చెందిన 13,04,561 మంది విద్యార్థులు ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 12,96,318 మంది అనగా 99.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. బాలికలు 99.67 శాతం, బాలురు 99.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. 70,004 మంది విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగా, మొత్తం 1,50,152 మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు.
ఇక ఫలితాలను అధికారిక cbseresults.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అలాగే digilocker.gov.in లో కూడా విద్యార్థులు వారి స్కోర్ లను చూసుకోవచ్చని చెప్పారు. మరోవైపు 65,000 మంది విద్యార్థుల ఫలితాలు ఇంకా సిద్ధమవుతున్నాయని, ఆగస్టు 5న ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. ముందుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ