ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ వెల్లడించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను అక్టోబర్ 29వ తేదీన ప్రకటించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu