సీనియర్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయన్ను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వీసీ సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. 1999 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఇప్పటివరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ మేరకు బదిలీలు, పోస్టింగ్ లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ