గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే డిసెంబర్ 1 వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ సంస్థలకు, వాణిజ్య/వ్యాపారసంస్థలు, దుకాణాలకు కూడా సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ