హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైదాబాద్ లో 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను మంత్రులు ఓదార్చారు. అలాగే వారికీ రూ.20 లక్షల చెక్కు అందించి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల విద్యా బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వపరంగా అన్ని విధాల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సైదాబాద్ లో మంత్రులు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ