ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 16, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 39 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనునట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కరోనా థర్డ్ వేవ్ పై సన్నద్ధత, మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ ఏర్పాటు, వైఎస్ఆర్ ఆసరా, సాగు నీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ