సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చేతిపై మౌనిక అనే టాటూగా ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ముందుగా సైదాబాద్ ఘటన తర్వాత నిందితుడు రాజు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి లేదా అరెస్ట్ కు క్లూ అందించిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఫొటో మరియు కొన్ని ఆనవాళ్లతో ప్రకటన కూడా విడుదల చేశారు. నిందితుడును పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఓవైపు పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతుండగా, రైల్వే ట్రాక్పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. కాగా రాజు ఆత్మహత్యపై పోలీసులు అధికారంగా ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ