తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమిస్తూ ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బస్ భవన్ లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా సోమవారం ఉదయం బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సన్నిహితులు పాల్గొని బాజిరెడ్డి గోవర్ధన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ, టీఎస్ఆర్టీసీ సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. కరోనా పరిస్థితులతో ఆదాయం బాగా తగ్గిందని, మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని చెప్పారు. తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు కట్టబెట్టినందుకు సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ బస్ భవన్ లో పదవి బాధ్యతలు స్వీకరించాను..
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు నా మీద విశ్వాసంతో ఈ బాధ్యతలు కట్టబెట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.@RaoKavitha @VPRTRS pic.twitter.com/lhuQbdnyFo— Goverdhan Bajireddy (@Govardhan_MLA) September 20, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ