దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచి అమల్లో ఉన్న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం గడువును తాజాగా ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020 న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ ఫిబ్రవరి 28, 2022 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తునట్లుగా డీజీసీఏ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో విమాన సేవలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. అలాగే ఎయిర్ బబుల్ ఏర్పాట్లతో నడిచే విమానాలు కూడా ప్రభావితం కావని తెలిపారు.
— DGCA (@DGCAIndia) January 19, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF