తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. కాగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు శంభీపూర్ రాజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ శంభీపూర్ రాజు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై శంభీపూర్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ