దేశంలో ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా 5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఎక్కడా అధికారం దక్కించుకోలేక పోయింది. పంజాబ్ రాష్ట్రంలో కేవలం 17 స్థానాల్లోనే గెలిచి అధికారం కోల్పోగా, గోవాలో 40 స్థానాలకు గానూ 12 స్థానాలు, ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గానూ 18 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అలాగే పార్టీకి ఘనమైన చరిత్ర కల్గిన ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మరోసారి ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక మణిపూర్ లో 10 కి పైగా స్థానాలు సాధించి మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కీలక నాయకులు పరాజయం పాలయ్యారు. పలితాలతో కాంగ్రెస్ నాయకుల్లో , కార్యకర్తల్లో నిరాశ నెలకుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తా. ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు. కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వాలంటీర్లు చేసిన కృషికి, అంకితభావానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మేము ఫలితాల నుండి నేర్చుకుంటాము మరియు భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటాం” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ