సెప్టెంబర్ 19 న రాత్రి 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబిలో తొలి మ్యాచ్ తో ఐపీఎల్-2020 మొదలయిన సంగతి తెలిసిందే. కాగా బార్క్ సర్వ్ ఆధారంగా ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ ప్రారంభ మ్యాచ్ను రికార్డ్ స్థాయిలో 20 కోట్ల మంది వీక్షించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ వేదికగా ద్వారా వెల్లడించారు. ప్రపంచంలో ఏ సోర్ట్స్ లీగ్ నైనా, ఏ దేశంలోనైనా ఓ ప్రారంభ మ్యాచ్ను ఇంతమంది వీక్షంచలేదని, ఇదే అత్యధికమని జైషా తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిపి ఈ స్థాయిలో కొత్త వ్యూయర్ షిప్ తో రికార్డు నమోదయిందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Total viewership on @StarSportsIndia and @DisneyPlusHS.@starindia @ThakurArunS @BCCI
— Jay Shah (@JayShah) September 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu