ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహాన్నిచ్చాయి. నాలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టటానికి బీజేపీ సిద్ధం అయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 260 పైగా స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ సారధ్యంలోని బీజేపీ పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేప్పట్టబోతోంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా యూపీ ఫలితాలే వస్తాయని అన్నారు. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు కూడా వస్తాయని రాజాసింగ్ అన్నారు.
యూపీలో దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపాడని, అదే సమయంలో ప్రజా సంక్షేమానికి కృషి చేసాడని తెలిపారు. దేశంలో ఇక కాంగ్రెస్ కనుమరుగు కానుందని వెల్లడించారు. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం పార్టీ యూపీలో 100 స్థానాలలో నిలబడి.. ఒక్క దానిలో కూడా గెలవలేదని పేర్కొన్నారు. స్వతహాగా దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరైన రాజాసింగ్ పోలింగ్ సమయంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తాజాగా మరోసారి రాజాసింగ్ అలంటి వ్యాఖ్యలే చేశారు. యూపీ ఫలితాలు తెలంగాణాలో కూడా రిపీట్ అవుతాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ