ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఉపన్యాస కళ” అనే అంశం గురించి వివరించారు. ఈ కాలంలో ఎన్ని అర్హతలు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా కూడా పదిమందిలో ప్రసంగించాల్సి వస్తే ఇంకా బయపడేవారున్నారని అన్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఏ రంగంలో ఉన్నా కూడా ఎక్కడో ఒకచోట ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఉపన్యాసం ఎలా ఇవ్వాలి?, ఏ విధంగా ఇస్తే బాగుంటుందనే విషయాల గురించి తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇