కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 256 కరోనా కేసులు, 0 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,33,998 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 68,130 గా ఉంది.
ఇక కొత్తగా కరోనా నుంచి 378 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,62,529 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,502 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఎర్నాకులంలో 60, తిరువనంతపురంలో 47, కొట్టాయంలో 35, కోజికోడ్ లో 29, పతనంతిట్టలో 23, కొల్లంలో 14, ఇడుక్కిలో 13, త్రిసూర్ లో 9 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కేరళలో మొత్తం 11,016 కరోనా పరీక్షలను పరీక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ