పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశ ఐక్యతలో భాగంగా అధికార భాష హిందీని ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, స్థానిక భాషలకు కాకుండా ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని అన్నారు. అలాగే ప్రస్తుత కేబినెట్ లోని 70 శాతం ఎజెండా కూడా హిందీ బాషలోనే సిద్ధమైతుందని అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“అమిత్షా జీ…భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మరియు నిజమైన ‘వసుధైక కుటుంబం’. మన గొప్ప దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో మరియు ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకోవడానికి మనం ఎందుకు అనుమతించము!. భాషా దురభిమానం లేదా ఆధిపత్యం బూమరాంగ్ అవుతుంది. నేను మొదట భారతీయుడిని, ఆతర్వాత గర్వించదగిన తెలుగువాడిని, తెలంగాణవాణ్ణి. నా మాతృభాష తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. హిందీని విధించడం మరియు ఇంగ్లీష్ ని నిషేధించడం ప్రపంచ ఆకాంక్షలను కలిగి ఉన్న ఈ దేశంలోని యువకులకు గొప్ప అపచారం” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
I am an Indian first, a proud Telugu & Telanganaite next
Can speak in my mother tongue Telugu, English, Hindi & a little bit of Urdu too
To impose Hindi & diss English will be a great disservice to the youngsters of this nation who have global aspirations#stopHindiImposition
— KTR (@KTRTRS) April 9, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ