తెలంగాణ ఆర్టీసీ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనసు దోచుకుంటున్నది. ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘మాతృదినోత్సవం’ (మదర్స్ డే) సందర్భంగా టీఎస్ఆర్టీసీ తల్లులకు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. రేపు (శనివారం) ఐదేళ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణం చేసే తల్లులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
#TSRTC is delighted to present a special offer to celebrate the day & give them a unique experience of FREE TRAVEL in all the bus services, including AC services. #mothers travelling with children below five years can avail the offer on 8th May, 2022 #MothersDay2022 pic.twitter.com/X1EpYeMt07
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 6, 2022
ఆర్టీసీ కల్పిస్తున్న ఉచిత ప్రయాణ అవకాశాన్ని తల్లులంతా సద్వినియోగం చేసుకోవాలని వారు ఒక ప్రకటనలో కోరారు. పల్లె వెలుగు బస్సుల నుంచి ఏసీ సర్వీసు బస్సుల వరకు అన్ని బస్సులలో ఈ ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఆర్టీసీ ప్రకటించిన ఆఫర్పై మహిళలు ముఖ్యంగా తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ