తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి నామినేషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నిక-2022లో దీవకొండ దామోదర్రావు, పార్థసారధిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం వీరిద్దరికి రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ముందుగా తెలంగాణలో ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు నాలుగు నామినేషన్స్ దాఖలు కాగా, జూన్ 1న నామినేషన్ల పరిశీలన అనంతరం శ్రమజీవి పార్టీ అభ్యర్థులు జాజుల భాస్కర్, భోజ్రాజ్ కొయాల్కర్ దాఖలు చేసిన నామినేషనన్స్ సరిగ్గా లేని కారణంగా తిరస్కరించినట్టు ఇంచార్జి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో (జూన్ 3, శుక్రవారం) ముగియడంతో, పోటీలో ఎవరూ లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF