జనసేన పార్టీ ముఖ్యనేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడంలేదని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఈరోజు విశాఖపట్టణంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు నాగబాబు సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి జనసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయరని, ఆయనకున్న అభిమానుల దృష్ట్యా అది సాధ్యపడదని తెలిపారు. అయితే పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే ఆలోచనలో జనసేనాని ఉన్నారని పేర్కొన్నారు. పొత్తులపై తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని, దానిపై ఇప్పటినుంచే ఊహాగానాలు వద్దని అన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకి గానీ, ఎంపీ సీటుకి గానీ తాను పోటీ చేయాలని అనుకోవడంలేదని, పార్టీ పరంగా సేవలందిస్తానని నాగబాబు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF