మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 12, మంగళవారం నాడు 2,435 కరోనా కేసులు, 13 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,07,648 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,991 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 2,882 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 78,42,090 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.93 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.84 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 17,567 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 8,24,41,476 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY