దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 29 వ రోజైన ఫిబ్రవరి 13, శనివారం నాడు మొత్తం 8071 సెషన్స్ లో 2,96,211 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 2,72,583 లబ్దిదారులకు మొదటి డోస్, 23,628 మంది హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు.
ఇక ఫిబ్రవరి 14, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి మొత్తం సంఖ్య 82 లక్షలు (82,63,858 ) దాటింది. వీరిలో 59,84,018 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 22,56,212 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 23,628 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్) ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఇప్పటికి దాకా కరోనా వ్యాక్సినేషన్ లో దేశంలోని 10 రాష్ట్రాల నుంచే 68.55 % లబ్ధిదారులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ