శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 189వ పాఠంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన “కొండ పొలం” సినిమాపై విశ్లేషణ చేశారు. కొండ పొలం సినిమా సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవల ఆధారంగా తీసారని తెలిపారు. కథా, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు క్రిష్ ప్రతిభ, చేసుండాల్సిన మార్పులు గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇