తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బుధవారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్కు భాగ్యలక్ష్మి దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం గవర్నర్కు శాలువా కప్పి సత్కరించింది. ఈ క్రమంలో గవర్నర్ తమిళి సై, భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. కాగా హైదరాబాద్ నగరంలోని అతిపురాతన చారిత్రాత్మక కట్టడంగా ఈ ఆలయానికి పేరుంది. ఒకప్పుడు ముస్లిం నవాబుల పాలనలో ఉన్న హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడం చార్మినార్ చెంతనే ఈ ఆలయం ఉండటం విశేషం. శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఐదుసార్లు అమ్మవారికి హారతి ఇవ్వడం ఇక్కడి ఆచారం. అలాగే ముఖ్యంగా బోనాల పండుగ సందర్భంగా ఇక్కడి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY