భారత మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ చంద్రకాంత్ పండిట్ ను కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తన కొత్త హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. 2020 ఐపీఎల్ సీజన్ నుంచి కేకేఆర్ హెడ్ కోచ్ గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్ కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ గా చంద్రకాంత్ పండిట్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలో కోచ్ గా వ్యవహరించడం పండిట్కి ఇదే తొలి సారి. అలాగే అతను కేకేఆర్ టీమ్ యొక్క మొదటి భారత హెడ్ కోచ్ కానున్నాడు.
1986-1992 మధ్య భారత్ తరపున పండిట్ 5 టెస్టులు, 36 వన్డేలు ఆడాడు. కాగా భారత్ దేశవాళీ అత్యంత ఫేమస్ కోచ్ గా పండిట్ గుర్తింపు పొందాడు. పండిట్ కోచ్ గా ఉండగా 2002-03, 2003-04, 2015-16లో సీజన్లలో ముంబయి జట్టు, 2017-18, 2018-19 సీజన్లలో విదర్భ జట్టు రంజీ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే చంద్రకాంత్ పండిట్ 2021-22 సీజన్ లో కోచ్గా మధ్యప్రదేశ్కు 23 ఏళ్ల తర్వాత తొలి రంజీ ట్రోఫీ టైటిల్ను అందించాడు.
చంద్రకాంత్ పండిట్ నియామకంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ, “మా ప్రయాణం యొక్క తదుపరి దశ ద్వారా మమ్మల్ని నడిపించడానికి చందు నైట్ రైడర్స్ కుటుంబంలో చేరడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము. అతను చేసే పనుల పట్ల అతని లోతైన నిబద్ధత మరియు దేశవాళీ క్రికెట్లో అతని విజయాల ట్రాక్ రికార్డ్ ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఉన్నాయి. మా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్తో అతని భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.
కొత్త ఛాలెంజ్ని స్వీకరించడంపై చంద్రకాంత్ పండిట్ స్పందిస్తూ, “ఈ బాధ్యతను అందుకోవడం గొప్ప గౌరవం మరియు విశేషం. నైట్ రైడర్స్తో అనుబంధం ఉన్న ఆటగాళ్లు మరియు ఇతరుల నుండి, కుటుంబ సంస్కృతి గురించి, అలాగే సృష్టించబడిన విజయ సంప్రదాయం గురించి నేను విన్నాను. సపోర్ట్ స్టాఫ్ మరియు సెటప్లో భాగమైన ఆటగాళ్ల నాణ్యత గురించి నేను సంతోషిస్తున్నాను మరియు సానుకూల అంచనాలతో ఈ అవకాశం పట్ల ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY