సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉచిత వైద్య సేవలందించేందుకు గాను ఉచిత ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. బుధవారం ఆయన, సతీమణి వసుంధరతో కలిసి వాహనానికి పూజ చేసిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. దీని ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తామని, రక్త పరీక్షలు మొదలుకుని అన్నిరకాల వైద్య చికిత్సలు అందించటానికి ఈ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని, ఇది కేవలం ఆరంభమేనని, ఇలాంటి ఉచిత ఆరోగ్య రథాలను మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని బాలకృష్ణ అన్నారు.
హిందూపురం ఆసుపత్రిలో కరోనా విపత్కర కాలంలో 30 వెంటిలేటర్లను అందిస్తే, వాటిని వినియోగించకుండా మూలన పడేయడం బాధాకరమని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. గ్రామస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య రథం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ఈ వాహనంలో డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్, లేబొరేటరీ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారని, 200 వరకు వ్యాధులను గుర్తించి మందులతో సహా చికిత్స అందిస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు. కాగా డయాగ్నస్టిక్ సేవలతో మొబైల్ క్లినిక్గా మార్చడానికి వాహనం కోసం ₹40 లక్షలు వెచ్చించారు. ఈ వాహనంపై ‘ప్రతి ఇంటికి శుభమస్తు – మన హిందూపురం, మన బాలయ్య’ అనే స్లోగన్ ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY