న్యూజిలాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబయిలో రెండో టెస్టు జరగనుంది. అలాగే నవంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో తలపడే 16 మందితో కూడిన భారత్ ఆటగాళ్ల జాబితాను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ శుక్రవారం నాడు ప్రకటించింది. న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ తో పాటుగా, తొలి టెస్టుకు కూడా విరాట్ కోహ్లీ విరామం తీసుకోనున్నాడు. విరాట్ కోహ్లీ 2వ టెస్టుకు జట్టులో చేరి జట్టుకు నాయకత్వం వహించనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ టెస్ట్ సిరీస్ కు స్టార్ బ్యాట్స్ మెన్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ కూడా పూర్తిగా దూరం కావడంతో, తొలిటెస్టుకు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), ఛటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ