అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నేడు పర్యటించనున్న ప్రధాని మోదీ

Assam, Mango News, Narendra Modi to Visit Assam, Narendra Modi to Visit Assam and West Bengal States, Narendra Modi to Visit West Bengal, PM Modi in Assam, PM Modi in poll-bound Assam, PM Modi To Raise Poll Pitch In Bengal Today, PM Modi to visit Assam and West Bengal, pm narendra modi, PM Narendra Modi to visit West Bengal, West Bengal, West Bengal Live Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7, ఆదివారం నాడు అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అస్సాంలో రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రోడ్ల నెట్‌వ‌ర్క్‌ మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన “అస్సాం మేళా”ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 11:45 గంటలకు అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలోని ధేకియాజులి వద్ద అస్సాం మేళా కార్యక్రమం జరగనుంది. అలాగే దీంతోపాటు బిశ్వనాథ్, చరైడియోలలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే రెండు ఆస్పత్రుల నిర్మాణానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చేరుకొని సాయంత్రం 4:50 గంటలకు ప‌శ్చిమ‌బెంగాల్ ‌లోని హల్దియాలో కొన్ని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ముందుగా రూ.1,100 కోట్లతో నిర్మించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించిన వంటగ్యాస్ (ఎల్పీజీ) దిగుమతి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ లో భాగమైన 348 కిలోమీటర్ల దోభీ-దుర్గాపూర్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇవేగాక పశ్చిమబెంగాల్ లో మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + nine =