మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19, శుక్రవారం నాడు 2285 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,80,696 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,191 కి పెరిగింది. ఇక కరోనా నుంచి కొత్తగా 2237 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 79,20,772 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.02 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.83 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 11,733 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా ముంబయిలో అత్యధికంగా 5852 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 1696, పూణేలో 1557, నాగపూర్ లో 378, నాషీక్ లో 365, పాల్గర్ లో 288, రాయగడ్ లో 235 ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 8,37,75,585 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY