దేశంలో గత 24 గంటల్లో మొత్తం 3,92,837 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 10,725 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 2.73 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.
అలాగే కొత్తగా మరో 36 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,488 కి పెరిగింది. మరో 13,084 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,37,57,385 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.60 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 94,047 (0.21%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఆగస్టు 24 (8am)–ఆగస్టు 25 (8am)):
- మహారాష్ట్ర – 1913
- కర్ణాటక – 1255
- కేరళ – 1154
- ఢిల్లీ – 945
- హర్యానా – 623
- తమిళనాడు – 547
- ఉత్తర్ ప్రదేశ్ – 538
- రాజస్థాన్ – 495
- తెలంగాణ – 338
- పశ్చిమబెంగాల్ – 313
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY