వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం కృష్ణా జిల్లా పెడనలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నాలుగో విడత రూ.193.31 కోట్ల నగదును లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, చీఫ్ విప్లు సామినేని ఉదయభాను, ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, కే పార్ధసారధి, అనీల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ప్రసంగం లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే..
- దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది, అలాంటి మగ్గం నేసే నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతోంది.
- ఇప్పటివరకు వారికి అండగా ఏ ప్రభుత్వం నిలబడలేదు, కానీ మా ప్రభుత్వం వారి సంక్షేమం కోసం కృషి చేస్తోంది.
- నేతన్నల జీవితాల లోని కష్టాలను నా పాదయాత్రలో గమనించా, అందుకే వారిని ఆదుకునేలా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ రూపొందించాం.
- పథకం ప్రారంభించినప్పటినుండి వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు నగదు అందిస్తున్నాం.
- ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు, అలాగే నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ. 96వేల సాయం అందనుంది.
- లంచాలకు, అవినీతికి తావు లేకుండా 80,546 మంది నేతన్నలకు నేరుగా వారి ఖాతాల్లోకి నేడు రూ. 193.31 కోట్లు జమ చేస్తున్నాం.
- కుల,మతాలకు అతీతంగా ఇప్పటివరకూ నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049 కోట్లు నగదును పంపిణీ చేశాం, అలాగే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 సాయం అందించాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY