టీటీడీ ఉద్యోగుల‌పై న‌టి అర్చ‌నా గౌత‌మ్ దాడి హేయ‌మైన చ‌ర్య, ఖండించిన టీటీడీ

TTD Respons over Actress Archana Gautam Allegations on Ticket Issue at Tirumala, Actress Archana Gautam TTD Issue, Actress Archana Gautam Ticket Issue, Actress Archana Gautam TTD Darshan, TTD Actress Archana Ticket Issue, Actress Archana Ticket Issue at Tirumala, Mango News, Mango News Telugu, Actress Archana Gautam, TTD Ticket Issue , TTD Darshan Ticket Issue, Tirumala Tirupati Devasthanam, Archana Gautam Allegations on Ticket Issue, Actress Archana Gautam Latest News And Updates, TTD Tickets News And Live Updates

టీటీడీ ఉద్యోగుల‌పై న‌టి అర్చ‌నా గౌత‌మ్ దాడి హేయ‌మైన చ‌ర్య అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. అవాస్త‌వ ఆరోప‌ణ‌ల‌తో ఉద్యోగుల‌పైనే త‌ప్పుడు ఫిర్యాదు ఇచ్చారని, దీన్ని టీటీడీ ఖండిస్తుందని అన్నారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.

“ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన శివ‌కాంత్ తివారి, న‌టి అర్చ‌నా గౌత‌మ్‌తో పాటు మ‌రో ఏడుగురికి ఆగ‌స్టు 31న శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం కేంద్ర స‌హాయమంత్రి నుంచి సిఫార‌సు లేఖ‌ను తీసుకుని తిరుమ‌ల‌కు వ‌చ్చారు. అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో ద‌ర్శ‌నం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ.300 ద‌ర్శ‌నం టికెట్లు మంజూరు చేస్తూ శివ‌కాంత్ తివారీకి చెందిన మొబైల్ నంబ‌రుకు మెసేజ్ పంపారు. అయితే వారు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోలేదు. అటు త‌రువాత శివ‌కాంత్ తివారి అద‌న‌పు ఈవో కార్యాల‌యానికి వెళ్లారు. అప్ప‌టికే టికెట్లు తీసుకోవాల్సిన గ‌డువు ముగిసిందని వారు తెలిపారు. శివ‌కాంత్ తివారితో పాటు అద‌న‌పు ఈవో కార్యాల‌యంలోకి చొచ్చుకుని వ‌చ్చిన న‌టి అర్చ‌నా గౌత‌మ్ ఆగ్ర‌హంతో విచ‌క్ష‌ణ కోల్పోయి కార్యాల‌య సిబ్బందిని దుర్భాష‌లాడారు. స‌ర్ది చెప్ప‌బోయిన ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. తివారి ఆమె చేస్తున్న యాగీని చూస్తూ ఉరుకున్నారు త‌ప్ప, ఆమెను వారించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చివ‌ర‌కు ఆద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది వారి వివ‌రాలు తీసుకుని రెండోసారి రూ.300 టికెట్లు కేటాయించినా తీసుకోవ‌డానికి న‌టి అర్చ‌నా గౌత‌మ్ నిరాక‌రించారు. అనంత‌రం అక్క‌డినుండి టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కార్యాల‌య సిబ్బంది త‌న‌పై చేయి చేసుకుని దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని త‌ప్పుడు ఫిర్యాదు చేశారు. అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బందిని అక్క‌డి సీఐ పిలిపించి విచార‌ణ చేప‌ట్టారు. సిబ్బంది తాము తీసిన వీడియోను సీఐకి చూప‌గా న‌టి దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విషయం వెలుగుచూసింది. దీంతో న‌టి వెన‌క్కి త‌గ్గి అక్క‌డినుంచి వెళ్లిపోయారు” అని తెలిపారు.

సెప్టెంబర్ 1వ తేదీకి బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ కావాలంటే రూ.10,500 చెల్లించి శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ పొందొచ్చ‌ని మాత్ర‌మే సిబ్బంది స‌ల‌హా ఇచ్చారని చెప్పారు. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది ద‌ర్శ‌నం టికెట్ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశార‌ని స‌ద‌రు వీడియోలో న‌టి ఆరోపించారన్నారు. తాను సెల‌బ్రిటీ అయినందువ‌ల్ల ఏమి చెప్పినా భ‌క్తులు న‌మ్ముతార‌నే అభిప్రాయంతో న‌టి అర్చ‌నా గౌత‌మ్ అవాస్త‌వాల‌తో సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేశారని అన్నారు. భ‌క్తులు ఇలాంటి అవాస్త‌వ ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =